బంగారంలో పెట్టుబడి ఎంత శాతం ఉండాలి ?


బంగారంలో పెట్టుబడి ఎంత శాతం ఉండాలి ?

ఈ మధ్య నేను తరచుగా అందుకుంటున్న మెయిల్స్ లో అధిక భాగం  బంగారంలో పెట్టుబడి  గురుంచే అధికంగా ఉంటున్నాయి. దానికి ముఖ్య కారణం ఈ మధ్య బంగారం రేటు అధికంగా పెరగడం కూడా ఒక కారణం. నేను అందుకున్న మెయిల్స్ లో అధిక భాగం వారి వద్ద ఉన్న పెట్టుబడిలో బంగారంలో ఎంత శాతం పెట్టుబడిగా పెట్టాలి ?  బంగారం లో పెట్టుబడి పై మీ ఉద్దేశం ఏమిటి ? లాంటి  ప్రశ్నలు అధికంగా ఉన్నాయి.దీనికి నా సమాధానం వ్యక్తిగతంగా నా పోర్ట్ ఫోలియో లో 5% కంటే అధికంగా పెట్టుబడి ఉండటానికి నేను అసలు ఇష్టపడను. అదే విధంగా ఇన్వెస్టర్లను కూడా వారి  పోర్ట్ ఫోలియో లో  10%  కంటే అధికంగా పెట్టుబడి పెట్టడాన్ని ఎంత మాత్రం మంచిది కాదు అనే హెచ్చరిస్తాను. ఎందుకంటె ఒక ఆర్ధిక నిపుణుడిగా బంగారం పై నాకంటూ ఒక నిచ్చిత అభిప్రాయం ఉంది. నేను కొన్ని సంవత్సరాలుగా అన్ని రకాల ఇన్వెస్ట్మెంట్ అసెట్ తరగతులను నిశితంగా విశ్లేషించడం జరిగినది.వాటిలో బంగారం యొక్క విలువను లెక్కించడానికి సరియైన పద్దతంటూ లేదు. మనం సాదారణంగా దేనిలో అయినా పెట్టుబడి పెడుతున్నాం అంటే   దాని యొక్క ప్రస్తుత విలువను, ఆదాయ వ్యయాలను, బ్యాలన్స్ షీట్ మొదలగు వాటిని పరిశీలించి దాని భవిష్యత్తు ను అంచానా వేస్తాం. కాని బంగారం మాత్రం ఎలాంటి ఆదాయాన్ని ఇవ్వదు. అందువలన దాని విలువను ఖచ్చితంగా అంచనా  వేయడం మాత్రం ఆచరణాత్మకంగా సాధ్యం కాదు.   
సాదారణంగా బంగారం ధర అమెరికా మానిటరీ పాలసీ తో ప్రత్యక్ష సంభందం కలిగి ఉంటుంది. అమెరికా మానిటరీ పాలసీ లో పెరుగుదల లేదా తగ్గుదల బంగారంపై  ప్రభావం కలిగి ఉంటుంది.బంగారం విలు కట్టడానికి అనేక సిద్దాంతాలు ప్రతిపాదిన్చాబడ్డాయి. వాటిలో. అమెరికా మానిటరీ పాలసీ , ద్రవ్యోల్భణం. ముడిచమురు ధరలు మొదలగునవి ఉన్నాయి. కాని ఇవి ఏవి కూడా ఖచ్చితమైనవి  కావు.ఎందుకంటె బనగారాం ఎలాంటి ఆదాయాన్ని ఉత్పత్తి కానీ  , జనరేట్ చేయడం కాని చేయదు.అందువలన బంగారం యొక్క  విలువ ఖచ్చితంగా అంచానా వేయడం సాధ్యం కాదు. అందువలన నేను నా పెట్టుబడిలో 5% కంటే అధికంగా బంగారంలో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడను. అదే విధంగా ఎవ్వరిని కూడా 10%  కంటే అధికంగా పెట్టుబడి పెట్టడానికి సలహా ఇవ్వను.ఐతే కొంత మంది నాతో విభేదించవచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా బంగారం ఈక్విటీ మార్కెట్ కంటే అధిక ప్రతి ఫలం అందిస్తుంది కదా ? అని. రెండు మూడు సంవత్సరాల నుండి  ఈక్విటీ మార్కెట్  తక్కువ ప్రతి ఫలం అందించిన దీర్ఘకాలంలో మాత్రం  ఈక్విటీ మార్కెట్  కంటే అధిక రాబడి అందించే సాధానాలు లేవనే చెప్పాలి. కాకపోతే  ఈక్విటీ మార్కెట్  లో మంచి అవగాహనతో ఇన్వెస్ట్ చేయడం చేయాలి. అంతే కాని ఎవ్వరో చేప్పారని, ఎవ్వరో ఇన్వెస్ట్ చేసారని కాకుండా మీరు స్వయంగా విశ్లేషించే సామర్ధ్యం తప్పకుండా కలిగి ఉండాలి.స్టాక్ మార్కెట్ పై మీకు ఏ మాత్రం అవగాహన లేకున్న నష్టాలపాలు కావడం చాలా సర్వసాదారణం. అందుకే ప్రతి ఒక్కరూ తప్పకుండా ఆర్ధిక విషయాలపై అవగాహన కలుగ చేసుకోవాలి. Learn to earn    

రూపాయి పతనం వలన మన పై ఏ విధమైన ప్రభావం ఉంటుంది.


రూపాయి పతనం వలన  మన పై ఏ విధమైన ప్రభావం ఉంటుంది.
రూపాయి  విలువ పతనం  వలన  మన పై చాలా ప్రభావం ఉంటుంది. ముందుగా రూపాయి విలువ పడిపోవడం వలన లాభపడేది  ఎవరో ఒక్కసారి పరిశీలిద్దాం  .
ఎగుమతి దారులు సాదారణంగా వారూ ఎగుమతి చేసిన వస్తువులకు లేదా  అందించిన సేవలకు  వారి  పేమెంట్ డాలర్ లేదా విదేశీ కరెన్సీ రూపంలో అందుకొని వాటిని మన రూపయలలోకి మార్చుకుంటారు.రూపాయు పతనం వలన వారూ మార్చుకొనే డాలర్ లేదా విదేశీ కరెన్సీ కి అధిక రూపాయలు రావడం వలన లాభం కలుగుతుంది.
NRI లు  విదేశాల నుండి తరుచుగా వారి కుటుంబ సభ్యులకోరకు డబ్బులు పంపిస్తుంటారు. రూపాయు పతనం వలన వారూ పంపించే డాలర్ కి అధిక రూపాయలు రావడంతో NRI లు మరియు వారి కుటుంబ సభ్యులు లాభం అందుకుంటారు.
కొంత మంది కొన్ని విదేశీ కంపెనీల కొరకు మన దేశంలో నుండి  అన్ లైన్ జాబ్ చేయడం జరుగుతుంది. దీనికొరకు వారూ విదేశీ కరెన్సీ రూపంలో పేమెంట్ అందుకోవడం జరుగుతుంది. వారూ కూడా లాభ పడతారు. ఉదా : Ad sense
ఇప్పుడు  రూపాయి విలువ పడిపోవడం వలన నష్టపోయేది ఎవరో ఒక్కసారి పరిశీలిద్దాం  .
దిగుమతిదారులు వారూ దిగుమతి చేసుకున్న వస్తువులకు లేదా పొందిన  సేవలకు పేమెంట్ డాలర్ లేదా విదేశీ కరెన్సీ రూపంలో చెల్లించవలసి ఉంటుంది.
విదేశాలకు వెళ్ళే టూరిస్టులు, విదేశాలలో చదువుకోవడానికి వెళ్ళే విద్యార్థులు వారి ప్రయాణానికి , విదేశాలలో అవసరమైన డాలర్లు పొందడానికి రూపాయి పతనం వలన అధిక రూపాయలు చెల్లించవలసి ఉంటుంది.
పైన పేర్కొన్న వారూ మాత్రమే కాకుండా సాదారణ ప్రజానీకంపై రూపాయి పతనం చాలా ప్రభావం కలుగచేస్తుంది. ముఖ్యంగా మన దేశం ఆయిల్ దిగుమతి చేసుకోవడం  వారి పేమెంట్ డాలర్ల రూపంలో జరపవలసి ఉండటం వలన  అధిక విదేశీకరెన్సీ కొరకు అధిక రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. అంతర్జాతీయ    మార్కెట్ లో ఆయిల్ ధరలు పెరగడానికితోడు , అదే సమయంలో మన రూపాయి విలువ పతనం కావడం వలన సామాన్యుడిపై  పెట్రోలు, డిజిల్ , గ్యాస్  ధరలు పెరగడం జరుగుతుంది. వీటి ధరలు పెరగడం వలన మిగితా వస్తువుల ధరలు కూడా పెరిగి సామాన్యుడిపై అధిక భారం పడుతుంది.అదేవిధంగా ఇతర దిగుమతి కంపెనీల పై అధిక భారం పడటం వలన అవి నష్టాలపాలు కావడమే కాకుండా కంపెనీలు మూసివేయాల్సిన పరిస్థితులు కూడా తలెత్తుతాయి. దీనివలన చాలా మంది ఉద్యోగాలు కోల్పోవాల్సిన  పరిస్థితులు ఏర్పాటు అవుతాయి.రూపాయి పతనం వలన  ఎగుమతిదారులు మరియు NRI లు తప్ప మిగితా ప్రజల పై తీవ్ర ప్రాభవం ఉంటుంది. ఏది ఎమైనప్పటికి కూడా రూపాయి పతనం కావడం దేశానికి ఎల్లప్పూడూ మంచిది కాదు. 


ముఖ్య గమనిక :మీరు  టెక్నికల్ అనాలసిస్ లో ఏదైనా ఒక పద్ధతి  ఎంచుకొని దానినే స్థిరంగా  మీరు ఫాలో అయితే స్టాక్ మార్కెట్ లో మీరు డబ్బులు సంపాదించు కోవడం చాలా సులభం. దాని కోసం ముందుగా మీకు కావలసినది స్టాక్ మార్కెట్ పై అవగాహన .ఒక్క విషయం తప్పకుండా గుర్తుంచుకోండి. లెర్నింగ్ చేస్తేనే ఎర్నింగ్ సాధ్యం అవుతుంది.  http://telugufinancialschool.blogspot.in/2012_09_01_archive.html