షేర్ మార్కెట్ లో షేర్ ధరలు ఎందుకు పెరుగుతాయి.?


షేర్ మార్కెట్ లో షేర్ ధరలు ఎందుకు పెరుగుతాయి.?
చాలా మందికి షేర్లు లేదా షేర్ మార్కెట్ అంటే చాలా దురభిప్రాయం ఉంది.గుర్రపు పందాలు.పెకాటలాగే అదికూడా  ఒక వ్యసనం అనుకుంటూ ఉంటారు.నిజానికి అది సరికాదు. రేసులూ, పెకాటాలు గెలవటం, ఓడటం అనేది కేవలం అదృష్టం మీదా మాత్రమే అధారపడి  ఉంటుంది.కానీ  ఈ షేర్ల బిజినెస్ లో కాసింత జ్ఞానం తో పాటు మెలకువతో ముందే రిస్కులను వూహించగలిగితే  లాభాన్ని సంపాదించవచ్చు.షేర్లలో ఉండే లాభాలు సాదరన్మగా రెండు రకాలుగా ఉంటాయి.మనం కొన్న షేరు ధర పెరగడం వలన వచ్చే లాభం మొదటిది.రెండవది కంపెనీ వచ్చిన లాభాలాలో నుండి మనకి కొత్త శాతం పంచి ఇవ్వడం . దానినే  డివిడెండ్ అంటారు.ఒక షేరు ని మనం పది రూపాయలకు కొని ఆర్నెల్ల తర్వాత దాని ధర ఇరవై రూపాయలకు పెరిగినప్పుడు అమ్మితే మనకి వచ్చిన లాభం పది రూపాయలు.రియల్ ఎస్టేట్ కంటే కూడా అధిక లాభాలు అందించే సాధనం షేర్ మార్కెట్ . కాని దానిపై పూర్తీ అవగాహన మాత్రం తప్పనిసరి.బ్యాంకుల్లో డబ్బూ ని ఫిక్సుడ్ డిపాజిట్ చేయడం వలన వచ్చే వడ్డీ శాతం కేవలం ఆరు నుండి ఎనిమిది శాతం మాత్రమే.దానిని మెట్యురిటీ అయ్యే వరకు తీయలెం కూడా.తీసుకున్నా వడ్డీ నష్టం తప్పదు.అదే షేర్ మార్కెట్ లో ఐతే మీ షేర్లు మీ ఇష్టం వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు.ఈ విధంగా భూమూలు, స్తిరాస్తులూ కాపాడుకోవటం, అమ్ముకోవటం, లాభం తీసుకోవడం కన్నా ఈ వ్యాపారం చాలా సులభం.

షేర్ ధర ఎందుకు పెరుగుతుంది. ?
దీనికి చాలా చిన్న సమాధానం. మనదేశంలో బ్యాంక్ వడ్డీ రేటు కన్నా మిగితా వస్తువుల ధరలు  విపరీతంగా పెరుగుతున్నాయి కాబట్టి.ఉదాహరణకు వంద మంది కలిసి తలా పదివేలు వేసుకొని పది లక్షలకి భూమి కొన్నారు అనుకోండి. అదే భూమి ఆర్నెల్ల తర్వాత పన్నెండు   లక్షలు ఐతే అప్పుడు ఒక్కొక్కరి షేరు విలువ  పన్నెండు వేలు అవుతుంది. ఈ లోపులో ఒకవేళ ఆ భూమి లో వేసిన వరి పైరు చేతికి వచ్చి లక్ష రూపాయల ధర అయిందనుకోండి.ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల డివిడెండు వస్తుంది.   మొత్తం మీదా మూడు వేలు లాభం కదా? ఒక్కొక్కరికి. అదే విధంగా కంపెనీ అతుల విలువ కూడా పెరుగుతుంది.ప్రతి కంపెనీ తన  లాభాలన్నింటిని వాటాదారులకు పంచాడు. కొంత వరకూ రిజర్వులో దాస్తుంది. అది కూడా మన అస్తే.పైన చెప్పుకున్న ఉదాహరణలో మన కంపెనీ గత ఐదు సంవత్సరాలుగా వచ్చిన లాభాలను రిజర్వు లో యాభై లక్షల వరకు దాచి పెట్టినది అనుకోండి.అప్పుడు మన పది రూపాయల షేరు ధర అరవై రూపాయలు అవుతుంది.కొన్నిసమయాలలో కంపెనీ రిజర్వు అమౌంట్ లో నుండి  కొంత  మొత్తం మనకి పంచుతుంది. వాటిని మనం బోనస్ షేర్లు అంటారు.  

ఈ రోజు స్టాక్ మార్కెట్ 09-10-2012


 రోజు స్టాక్ మార్కెట్ 09-10-2012
నిన్న నిఫ్టీ  5676  వద్ద క్లోజ్ కావడం జరిగినది. అంటే గత వారం  ఏర్పాటు చేసిన  గ్యాప్ 5650-5683  ఏరియాలో ప్రవేశించడం జరిగినది.ఈ రోజు ఆ గ్యాప్ పూర్తీగా నింపబడటం పూర్తీ కావచ్చు. అంటే నిఫ్టీ 5650 వరకు సులభంగా వస్తుంది.ప్రస్తుతం రెసిస్టన్స్ 5700, 5715 వద్ద  సపోర్ట్  5650,5638 వద్ద కలవు . 5700 పైన నిఫ్టీ నిలదోక్కుకోనంతవరకు  పై లెవల్లో  సెల్లింగ్ చేయడం మంచిది. 5700 పైన  నిలదోక్కుకుంటే మాత్రం  లాంగ్ పోజిషన్స్ తీసుకోవచ్చు.

ఈ వారం నిఫ్టీ 08-10-2012 to 12-10-2012


ఈ వారం నిఫ్టీ 08-10-2012 to 12-10-2012
గత వారం నిఫ్టీ లో ఏం కే  గోల్డ్ బ్రోకరేజ్ తప్పు ఆర్డర్స్ వలన నిఫ్టీలో తొమ్మిది వందల పాయింట్లు పడిపోవడం జరిగినది. మీకు ఇది వరకు 20 april 2012రోజున నిఫ్టీ  5300-5000 పడిపోవడం   may 2011లో అమెరికా మార్కెట్ డౌజోన్స్  1000 పాయింట్ల కి పడిపోవడం గుర్తుందా ?ఈ సంఘటనలు జరిగిన కొన్ని నెలల అనంతంరం నిఫ్టీ మరియు  డౌజోన్స్ ఈ టెక్నికల్ ఎర్రర్ వలన పడిపోయినంత వరకు పడిపోవడం జరిగినది. ఈ సారి కూడా అదేవిధంగా చరిత్ర పునరావృతం అవుతుందా లేదా అనేది చూడాలి.  అంటే నిఫ్టీ తిరిగి 4880 స్థాయికి  తిరిగి చేరుతుందా ?  లేదా ? అనేది వేచి చూడాలి.  
ఇక ఈ వారం మార్కెట్  విషయానికి వస్తే 12-10-2012 నాడు ఇన్ఫోసిస్ రెండవ క్వార్టర్ రిజల్ట్స్ మరియు అదే రోజు iip డేటా కూడా ఉన్నాయి. వీటి అనంతరం ఇన్వెస్టర్ సెంటిమెంట్ ఏవిధంగా ఉంటుందో చూడాలి.  మీకు ఇదివరకు చాలా సార్లు చెప్పడం  జరిగినది. మార్కెట్ లో ఏర్పాటు కాబడిన గ్యాప్స్ జాగ్రత్తగా గమనించాలి. ఈ గ్యాప్స్ సపోర్ట్ , రెసిస్టన్స్ గా మాత్రమే పనిచేయడం కాకుండా గ్యాప్ ఫిల్లింగ్ అనేది కూడా జరుగుతుంది. ఐతే శుక్రవారం జరిగిన పతనం ద్వారా ఈ ర్యాలీ లో నిఫ్టీ ఏర్పాటు చేసిన గ్యాప్ నింపబడినదా అంటే లేదు అని  నా సమాధానం.ఎందుకంటె బి ఎస్ ఈ  సెన్సెక్స్ లో శుక్రవారం ఎలాంటి  పతనం జరగలేదు. నార్మల్గానే ట్రేడింగ్ జరిగినది. అదే విధంగా నిఫ్టీ ప్యూచర్ శుక్రవారం కనిష్ట స్థాయి 5732  మాత్రమే.


మీరూ క్రింది నిఫ్టీ డేయిలీ చార్ట్ గాని గమనించినట్టు ఐతే 5740 వద్ద నిఫ్టీ కి రెసిస్టన్స్ వస్తున్న విషయం మీకు గత వారమే తెలియచేయడం జరిగినది. గత వారం నిఫ్టీ నిఫ్టీ డేయిలీ బేసిస్ మరియు వీక్లీ బెసేస్ గా రెసిస్టన్స్ ఐనటువంటి 5740 పైన క్లోజ్ కావడం జరిగినది. అంటే ఇప్పుడు ఈ రెసిస్టన్స్  సపోర్ట్ గా పనిచేస్తుంది.
క్రింది ఫోబోనస్సీ చార్ట్ పరిశీలించినట్టు ఐతే మీకు ఇదివరకే తెలియచేయడం జరిగినది.   నిఫ్టీ గోల్డెన్ రేషియో 61.8% ఐనటువంటి 5648వద్ద  సపోర్ట్ తీసుకోవడం మరియు  5638 వద్ద డబల్ బాటం ఏర్పాటు కావడంతో అక్కడి నుండి పైకి వెళ్ళడమే  జరిగినది. నిఫ్టీ  5740-5775 పైన నిలదోక్కుకుంటే 5850- 5900 వరకు సులభంగా చేరుకోగలదు. ఒకవేళ పతనం జరిగిన   5740 క్రింద 5640  వరకు మాత్రమే పతనం జరగడానికి అవకాశం కలదు.





 మీరూ  పైన  ఇచ్చిన వీక్లీ చార్ట్ ను ఒకసారి పరిశీలించండి. గత వారం లో మీకు చార్ట్ లో ట్రెండ్ లైన్ గీసి ఈ ట్రెండ్ లైన్ ప్రకారం నిఫ్టీకి రెసిస్టన్స్ 5815వద్ద రెసిస్టన్స్ రావడానికి అవకాశం ఉంది అని కూడా తెలియచేయడం జరిగినది. అదే విధంగా నిఫ్టీ  5815 వద్ద హై ఏర్పాటు కాబడి ట్రెండ్ లైన్ రెసిస్టన్స్ తో క్రిందికి పతనం కావడం జరిగినది. ఏది ఎమైనప్పటికి ఈ నేలాలో నిఫ్టీ 5500-5850 or 5900  మధ్యలో చలించడానికి అధిక అవకాశం కలదు. నిఫ్టీ లో ఏమైన మార్పులు చేర్పులు ఉంటే వెనతనే అప్డేట్ చేయగలం. లేదంటే ఈ వారం మొత్తానికి ఈ విలువలే ప్రామాణికం.
ముఖ్య గమనిక :మీరు  స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలసిస్ లో ఏదైనా ఒక పద్ధతి  ఎంచుకొని దానినే స్థిరంగా  మీరు ఫాలో అయితే స్టాక్ మార్కెట్ లో మీరు డబ్బులు సంపాదించు కోవడం చాలా సులభం. దాని కోసం ముందుగా మీకు కావలసినది స్టాక్ మార్కెట్ పై అవగాహన .ఒక్క విషయం తప్పకుండా గుర్తుంచుకోండి. లెర్నింగ్ చేస్తేనే ఎర్నింగ్ సాధ్యం అవుతుంది. రాజీవ్ గాంధీ ఈక్విటీ సేవింగ్ స్కీమ్